ఇటీవల ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించిన జనసేన నాయకులు

తిరువూరు, మల్లెల గ్రామంలో ఇటీవల దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణించిన పంతంగి మురళి జనసేన పార్టీ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి పంచకర్ల సురేష్, జిల్లా అధికార ప్రతినిధి మరీధు శివరామకృష్ణ, తిరువూరు నాయకులు ఉయ్యురు జయప్రకాశ్, బత్తుల వెంకటేశ్వరావు, పసుపులేటి రవీంద్ర, ఉయ్యురు శరత్, బెంజ్, పెరుమాళ్ళ మనోజ్, ఉయ్యురు భాను ఉజ్వల్ నివాళులు అర్పించి పరామర్శించడం జరిగినది. అలాగే తిరువూరులో ఇటీవల ప్రమాదాల్లో మరణించిన ఎస్.కె. ఇమ్రాన్ (ఎస్.కె. లాల్ అహ్మద్ గారి అబ్బాయి), అలానే తిరువూరులో చందర్లపాటి శేషగిరి (ధర్మ తండ్రి) స్వర్గస్తులయ్యారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి మనో ధైర్యం కలిగించడం జరిగింది.