జనసేన నాయకులుపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి: మాకినీడి శేషుకుమారి

కాకినాడ జిల్లా, పిఠాపురం, జనసేన పార్టీ జిల్లా నాయకులు మొగలి అప్పారావు మీద స్థలం తగాదాలో కక్ష పూరితంగా కొట్టి గాయాలపాలు చేసారు. వివరాలలోకి వెళితే స్థానిక జగ్గయ్య చెరువులో ఇటీవల స్థలం కొనుక్కొని గృహనిర్మాణం చేసుకున్నారు. పక్క స్థలం వారైన నాగులపల్లి గ్రామానికి చెందిన కుమార్ అనే వక్తి దుర్భాషలాడిన క్రమంలో నా భార్యను దుర్బాషలు ఆడవలసినపనేంటని అడుగగా కుమార్ వారి అనుచరులు గునపం ఇనుప రాడ్లుతో దాడి చేయగా అప్పారావుకు తల మీద, వివిధ చోట్ల బలమైన గాయాలు తగిలాయి. తండ్రి సహాయంతో స్థానిక గవర్నమెంట్ హస్పిటల్ కి తరలించగా ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స పొందుతున్న అప్పారావును వైద్యులు చూస్తుండగా మళ్ళీ ముగ్గురు దాడి చేసారు. అప్పారావు పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో కాకినాడ జీజీహెచ్ కి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జి మాకినీడి శేషుకుమారి హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని అప్పారావు ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. డాక్టర్ తో మాట్లాడి కండిషన్ గురించి అడిగి మెరగైన వైద్యం అందిచాలని డాక్టర్లను కోరారు. అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ దర్యాప్తు చేసి దాడికి పాల్పడిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. జనసైనికుల జోలికొస్తే సహించబోమని అప్పారావుకి, కుటుంబానికి అండగా ఉంటామని మీడియాతో అన్నారు.