పుల్వామా ఎన్కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదలు హతం
జమ్ముకశ్మీర్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఉగ్రవాదులను భద్రతా బలగాలు మత్తు పెట్టాయి. పుల్వామా జిల్లాలో జడూరా ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవగా, ఓ జవాన్ అమరుడయ్యాడు. జిల్లాలోని జడూరా ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున 1 గంటలకు ఎన్కౌంటర్ ప్రారంభమైందని ఆర్మీ ప్రతినిధి కల్నల్ రాజేష్ కలియా తెలిపారు. భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవగా, ఓ జవాన్ తీవ్రoగా గాయపడ్డాడని, దవాఖానకు తరలించగా అప్పటికే జవాన్ మరణించాడని వెల్లడించారు. ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతున్నదని పేర్కొన్నారు.