పెడన నియోజవర్గ ప్రజలారా.. రండి.. మీ సమస్యల పరిష్కారానికై జనసేనాని సిద్ధంగా ఉన్నారు: ఎస్ వి బాబు

సామాన్యుడి గలాన్ని ప్రభుత్వానికి వినిపించేలా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బాధ్యత పక్షాల నుండి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు అర్జీలు స్వీకరించి, బాధితుల తరపున ప్రభుత్వంతో పోరాటం చేయనున్నారు.

జూలై 10 వ తేదీన ఆదివారం పవన్ కళ్యాణ్ గారు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గం వరకు విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం, ఆకుల వారి వీధి, బందర్ రోడ్డు. (వంగవీటి మోహన రంగా గారి ఇంటికి సమీపంలో) జనవాణి జనసేన భరోసా కార్యక్రమంలో పాల్గొని.. ప్రజా సమస్యలపై బాధిత పక్షాల నుంచి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అర్జీలు స్వీకరిస్తారు.

కావున పెడన నియోజవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీ సమస్యలను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకు రావలసిందిగా పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఎస్ వి బాబు విజ్ఞప్తి చేశారు.