Tokyo Olympics: మహిళల హాకీ జట్టు పరాజయం

టోక్యో ఒలింపిక్స్‌ లో ఇవాళ బ్రిటన్‌ మరియు భారత మహిళల హాకీ జట్ల మధ్య కీలక పోరు జరిగింది. అయితే. ఈ ఉత్కంఠ పోరులో భారత మహిళల హాకీ జట్టు బ్రిటన్‌పై ఓటమి పాలైంది. దీంతో చేతులారా కాంస్య పతకాన్ని భారత మహిళల హాకీ జట్టు మిస్‌ చేసుకుంది. అటు భారత మహిళల హాకీ జట్టు ఘటన విజయం సాధించిన బ్రిటన్‌ జట్టు కాంస్య పతకాన్ని ఎగురేసుకుని పోయింది. బ్రిటన్‌తో జరిగిన పోరులో 3-4 తేడాతో పరాజయం చవి చూసింది భారత మహిళల హాకీ జట్టు. గెలుపు కోసం రాణి రాంపాల్‌ సేన ఆఖరి వరకు పోరాడిన ఫలితం దక్కలేదు. చివరకు విజయం బ్రిటన్ నే వరించింది.