పలు కుటుంబాలను పరామర్శించిన తోట పవన్ కుమార్

రాజానగరం, సీతానగరం మండలంలో జనసేన పార్టీ యువజన నాయకులు తోట పవన్ కుమార్ పలు కుటుంబాలను పరామర్శించడం జరిగింది. సీతానగరం గ్రామంలో పెంటా సుబ్రహ్మణ్యంకి ఇటీవల యాక్సిడెంట్ లో కాలికి గాయం అయిందని తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని వైద్యుల సూచనల మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేసారు. రఘుదేవపురం గ్రామంలో సూరి సీతారాముడు మాతృ వియోగంతో బాధపడ్తున్న విషయం తెలుసుకుని వారి పరామర్శించి దైర్యం చెప్పడం జరిగింది. రఘుదేవపురం గ్రామానికి చెందిన బలగం వీరభద్రరావు తండ్రి గారైన బలగం సూర్యనారాయణ ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలుసుకుని వారిని పరామర్శించి కుటుంబసభ్యులకు దైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీతానగరం మండల నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.