మాదిగల సమస్యల ఆత్మీయ సమావేశానికి జనసేన కి ఆహ్వానం

అనంతపురం నగరంలోని స్థానిక రామ్ నగర్ కార్యాలయంలో జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్ ని కలిసిన MHPS నాయకులు, వారి సమస్యలను వివరిస్తూ డప్పు, చర్మ మరియు చెప్పులు కుట్టే వారికి 21 సంవత్సరాలు నిండిన వారికి నెల నెలా రూ 5000/- పింఛన్ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలి అని తెలిపి మాదిగల సమస్యలపై ఆత్మీయ సమావేశానికి వినతిపత్రం ఇచ్చి సమావేశానికి పిలవడం జరిగింది.

సమస్యలు విన్న శ్రీ టీ.సీ.వరుణ్, సమావేశ వివరాలు తెలియజేస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని MHPS సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ రమేష్ బాబు (SC స్టేట్ జనరల్ సెక్రటరీ), శ్రీ సాకే సంజీవరాయుడు జిల్లా (ప్రధాన కార్యదర్శి), శ్రీ సాకే రాజప్ప (జిల్లా ఉపాధ్యక్షులు), శ్రీ హరి (జిల్లా ఉపాధ్యక్షులు) మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.