షేక్ రియాజ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తోట సుబ్బారావు
ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ ను గిద్దలూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు కంభం మండలం, చిన్న కంభం వాసి తోట సుబ్బారావు హైదరాబాద్ జనసేన పార్టీ ఆఫీస్ లో పుష్పగుచ్చం తో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది, తదనంతరం గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల సమస్యలను తోట సుబ్బారావు ద్వారా షేక్ రియాజ్ తెలుసుకోవడం జరిగింది. ఆయన ఆరు మండలాల గురించి వివరిస్తూ ఇప్పుడు ప్రధానమైన సమస్య గిద్దలూరు కు నీటి సమస్య అని.. తాగునీరు లేక గిద్దలూరు వాసులు అవస్థలు పడుతున్నారని.. ప్రస్తుతం వైసిపి ప్రభుత్వం అసమర్థతను ఎండగట్టారు. ఇకముందు ఆరు మండలాల సమస్యలను మేము పరిష్కరించడానికి జనసైనికులతో సిద్ధంగా ఉన్నామని రియాజ్ గారికి వివరించారు. అంతేకాకుండా జనసేన కు కంచుకోట అయినటువంటి గిద్దలూరు నియోజకవర్గం చాలా వెనుకబడిన ప్రాంతమని వివరిస్తూ.. మేము వారికి ఎల్లవేళలా సహాయంగా.. ఉంటూ మన పార్టీ సిద్ధాంతాల ప్రకారం ప్రజలందరికీ అండగా నిలుస్తామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గా చూడాలన్నదే మా ధ్యేయమని రియాజ్ గారికి వివరించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-12-at-3.19.16-PM-729x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-12-at-3.19.23-PM-748x1024.jpeg)