ఉద్యోగావకాశాల కోసం టెక్నికల్ కోర్సులలో శిక్షణ..

ప్రభుత్వ రంగ ఈ-గవర్నెన్స్ సంస్థ గ్రామీణ యువతకు సైబర్ భద్రత, క్యాడ్, 3డీ ప్రింటింగ్ కోర్సులను అందజేయనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫ్రాన్స్‏కు చెందిన ఎకోల్ సుపీరియర్ రాబర్ట్ డి సార్బన్ సంస్థతో కలిసి ఈ కోర్సులను అందించనుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సీఎస్‏సీ అకాడమీ కేంద్రాల్లో ఈ కోర్సులను అందుబాటులోకి తీసుకురానుంది. అటు గ్రామీణ యువత కోసం ప్రత్యేకంగా క్యాడ్, 3డీ ప్రింటింగ్ కోర్సులను ప్రారంభించనున్నట్లు సీఎస్‏సీ ఎండీ దినేశ్ త్యాగి తెలిపారు. నాన్ ప్రాఫీట్ పొందని ఎకోల్ సుపీరియర్ సంస్థతో భాగస్వామ్యం వలన ఉద్యోగావకాశాలతోపాటు, స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం 5 వేల సీఎస్‏సీ అకాడమీ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా.. అటు దేశవ్యాప్తంగా మరో 7000 కేంద్రాలను ప్రారంభించాలని అనుకుంటున్నట్లుగా త్యాగి తెలిపారు.