జనసేన ఆధ్వర్యంలో ట్రాన్స్ఫార్మర్ రిపేర్

కృష్ణాజిల్లా, గుడివాడ నియోజకవర్గం, ఎన్టీఆర్ కాలనీలో గత కొద్దికాలంగా ట్రాన్స్ఫార్మర్ దగ్గర విద్యుత్ వైర్లు నుంచి నిప్పు రవ్వలు రావడం, అవి కిందకు వేళాడుతూ ఉండడం, ట్రాన్స్ఫార్మర్ ఎత్తు కన్నా వైర్లు కిందకి ఉండటంతో ఎర్త్ వైర్లు సరిగా లేకపోవడం ద్వారా ట్రాన్స్ఫార్మర్ పక్కనే చెత్త వేయడంతో పాటు పందులు గుంపులుగా తిరిగి సంచరిస్తూ ఉండటం వల్ల అదే ప్రధాన రహదారి కావడంతో ట్రాన్స్ఫార్మర్ నుంచి నిప్పురవ్వలు రాజుకుని పక్కనే ఉన్న చెత్త తగలబడి భయభ్రాంతులకు గురవటం జరుగుతుంది. ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని ముందస్తు చర్యగా జనసేన నాయకులు లక్ష్మీకాంత్ స్పందించి విద్యుత్ శాఖ వారికి వినతిపత్రం ద్వారా అందజేసి, కాలనీలో అటువంటి సమస్యలు ఉన్న ట్రాన్స్ఫార్మర్లని విద్యుత్ శాఖ వారి సహాయంతో రిపేర్ చేయించడంతో పాటు దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది.