పద్మశ్రీ అల్లు రామలింగయ్యకు శతజయంతి సందర్భంగా మెగాభిమానుల నివాళులు

విజయనగరం, స్వర్గీయ పద్మశ్రీ అల్లు రామలింగయ్య శతజయంతి సందర్భంగా అంజనిపుత్ర చిరంజీవి ప్రజా సేవాసంఘం మరియు విజయనగరం జిల్లా చిరంజీవి యువత సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఉదయం స్థానిక బాలాజీ జంక్షన్ వద్ద, అంబేద్కర్ సామాజిక భవనంలో జనసేన పార్టీ నాయకులు, అంజనిపుత్ర చిరంజీవి ప్రజా సేవాసంఘం అధ్యక్షలు కోయ్యాన లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో పద్మశ్రీ అల్లు రామలింగయ్య చిత్రపటానికి పూలమాల వేసి అభిమానులంతా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చిరంజీవి యువత కార్యదర్శి, జనసేన నాయకులు పిడుగు సతీష్, లోపింటి కళ్యాణ్, సాయికుమార్, రవి, రాము తదితరులు పాల్గొన్నారు.