అమరజీవికి ఘన నివాళులు

చిత్తూరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జనసేన పిఎసి కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యతో కలిసి అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాముల ప్రాణ త్యాగాన్ని స్మరించుకున్నారు. అనంతరం జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు ఒక రాష్ట్రం కావాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాన్ని సైతం త్యాగం చేశారన్నారు. చిన్న వయసులోనే కుటుంబాన్ని సైతం త్యజించి సొంత రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములని ఆయన కొనియాడారు. అలాంటి గొప్ప రాష్ట్రం రాక్షసుల పాలనలో చిక్కుకుందని, తొందరలోనే ఆ పాలనకు చరమగీతం పాడి అద్భుత పాలన అందించి పొట్టి శ్రీరాములు త్యాగానికి సార్ధకత చేకూరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి అకేపాటి సుభాషిణి, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన, ఉమ్మడి చిత్తూరు జిల్లా గౌరవ అధ్యక్షులు కృష్ణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్న రాయల్, రాజేష్ యాదవ్, జిల్లా కార్యదర్శులు ఆనంద్, దేవర మనోహర్, కలప రవి, సంయుక్త కార్యదర్శి బీగల అరుణ, నగర ఉపాధ్యక్షులు బాబ్జీ, పార్ధు, లక్ష్మి, కొండా రాజా మోహన్, నగర ప్రధాన కార్యదర్శి, రుద్ర కిషోర్, నగర కారుదర్సులు కిరణ్ కుమార్, రవి, పురుషోత్తం రాయల్, హేమంత్, ఐటీ కో ఆర్డినేటర్ పార్థసారథి, సీనియర్ నాయకులు తోట జయంతి, రాజేష్ ఆచారి, రమేష్, గోపి, వంశీ,తిరుపతి అర్బన్ నాయకులు జనసేన సాయి, తిరుపతి రూరల్ నాయకులు రాంబాబు, మనోజ్ కుమార్, గౌస్ బాషా, వీరామహిళలు మధులత, శిరీష, దుర్గ, చందన, జనసైనికులు మోహిత్, బాలాజీ, ఇంద్ర తదితరులు పాల్గొన్నారు.