వంగవీటి మోహనరంగాకు ఘన నివాళులు

కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం: చరిత్రకు అందని మహా పురుషుడు, పేదల పాలిట పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మాజీ ఎమ్మెల్యే కీర్తి శేషులు వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్బంగా అవనిగడ్డ జనసేన ఆధ్వర్యంలో రంగాకు ఘనమయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ. ఆ మహాను బావుడు చనిపోయి 35 ఏళ్ళు గడినాయి. అయినప్పటికీ ప్రతి పేదవాడి గుండెల్లో నిలిచిపోయినారు. రెండు తెలుగు రాష్ట్రాలలో 2 లక్షల విగ్రహాలు ఉన్న నాయకుడు రంగా. ఈ 35 ఏళ్ళలో ఆయన పేరు చెప్పుకొని ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో అయన పేరును ఒక్క జిల్లాకు కుడా పెట్టకపోవటం చాలా బాధాకరం. ఓటు బ్యాంకు రాజకీయాలు కోసం పూల మాలలు వేస్తున్నారు. ఫొటోలు ముందు నిలబడి ధన్నాలు పెడుతున్నారు. కానీ కృష్ణా జిల్లాకు మాత్రం అయన పేరు పెట్టించలేకపోయారు. ఇప్పటికి అయిన ప్రభుత్వం స్పందించి కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలి అనీ రంగా గారి అభిమానులు కోరిక ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు. కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి ఉస్మాన్ షరీఫ్, చల్లపల్లి టౌన్ అధ్యక్షులు బొందలపాటి వీరబాబు, పసుపులేటి రవి, జనసేన పార్టీ అవనిగడ్డ టౌన్ ఉపాధ్యక్షులు ఆళ్ళమళ్ళ చందు బాబు, అవనిగడ్డ టౌన్ ప్రధాన కార్యదర్శి అన్నపురెడ్డి ఏసుబాబు
తదితరులు పాల్గొన్నారు.