నిజం గెలిచింది: పసుపులేటి హరిప్రసాద్

  • చంద్రబాబు దంపతులతో జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి: నిజం గెలవాలంటూ నారా భువనేశ్వరి చేసిన పోరాటంతో నిజం గెలిచిందన్నారు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. తిరుమలకు విచ్చేసిన చంద్రబాబు దంపతులను శుక్రవారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులతో కాసేపు భేటీ అయ్యారు. నిజం గెలవాలంటూ నారా భువనేశ్వరి చేసిన పోరాటం ఫలించిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, టిడిపి ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని వారికి తెలిపారు.

  • గంటా శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతికి విచ్చేసిన ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య తాజా రాజకీయ పరిణామాలు చర్చకు వచ్చాయి.