సిఎం క్యాంప్‌ కార్యాలయంలో ఉగాది వేడుకలు

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం సీఎం జగన్‌ పండితులను సత్కరించారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్‌ వ్యవసాయ పంచాంగం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ” ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో కళకళలాడాలి. ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవాలి. కరోనా పీడ శాశ్వతంగా విరగడ కావాలి” అని ఆకాంక్షించారు.