అప్రజాస్వామిక నియంతృత్వ ప్రభుత్వం అంతం కావాలి: శ్రీమతి లోకం మాధవి

నెల్లిమర్ల నియోజకవర్గం: తెలుగు అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నుండి విడుదల కావాలనీ మరియు రాష్ట్రంలో అప్రజాస్వామిక నియంతృత్వ ప్రభుత్వం అంతం కావాలని నెల్లిమర్ల జనసేన పార్టీ ప్రియతమ నాయకులు శ్రీమతి లోకం మాధవి డెంకాడ మండలంలో మోపాడ గ్రామంలోని హజారాయ్ తాజుద్దీన్ బాబా ఆశ్రమం నందు జనసైనికులు, వీరమహిళలు మరియు తెలుగుదేశం పార్టీ పెద్దలూ నాయకులతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని సంఘీభావాన్ని తెలిపారు.