జగన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం గంజాయికి కేరాఫ్ అడ్రస్ గా మారింది

పాలకొల్లు: నాటి పాలకులు మన ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా చెయ్యాలి అనుకునేవాళ్లు కానీ ఈ 2019లో ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొదలైందో మన ఆంధ్ర రాష్ట్రం గంజాయికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని రియా పేర్కొన్నారు. ఆదివారం ఆమె మీడియా ముఖంగా మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో పబ్జి మత్తులో ఉంటూ యువతని గంజాయి మత్తులోకి తోస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అలాగే యువతని గాలికి వదిలేసాడు. వందేమాతరం గళం వినిపించాల్సిన మన భావితరం గంజాయి మత్తులో ఉంటూ ఆ మత్తుకి బానిసై ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేస్తూ, రోడ్డు మీదకి వచ్చి పిచ్చోడి లాగా తిరుగుతూ ఉన్న సంఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం. పాఠశాలలో కళాశాలలో గంజాయి సేవిస్తూ పట్టు పడినా కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మొన్నటి వరకూ దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఆంధ్ర ప్రదేశ్ వైపు ఉండేవి. గంజాయి వ్యాపారం వేల టన్నులు బరువు అలాగే సులభంగా దొరికిపోతున్నారు అని వేల కోట్లు వ్యాపారం సరిపోవడం లేదని కొత్తగా ఇప్పుడు డ్రగ్స్ అయితే తక్కువ బరువు లక్షల కోట్లు వ్యాపారం చేయచ్చు అని ఈ దారి ఎన్నుకున్నాడు. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి
సి బి ఐ వాళ్ళు పట్టుకోగలిగారు. విచారణ చేయగలుగుతున్నారు. లేదంటే కోడ్ లేకుంటే రాష్ట్ర పోలీసులు ఏదోలా జగన్ కి మేలు చేసి ఉండేవారు ఏమో తెలియదు. ఏమైనా దేశం మొత్తం మనవైపు చూసేలా చేస్తాను అన్నాడు జగన్. కానీ నేడు ప్రపంచం మొత్తం అభివృద్ది వైపు కాకుండా డ్రగ్స్ మత్తులో ప్రపంచం మొత్తం మనవైపు చూసేలా చేసిన ఈ జగన్ ని దేనితో కొట్టాలి.