శింగనమల జనసేన ఆద్వర్యంలో జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు

శింగనమల: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జిల్లా అద్యక్షులు టి సి వరుణ్ సూచనలతో జగనన్న ఇల్లు పేదోడి కన్నీళ్ళు కార్యక్రమంలో బాగంగా ఆదివారం సింగనమల నియోజకవర్గ పరిధిలోని బుక్కరాయసముద్రం మండలము. దండువారి పల్లి గ్రామంలో గల జగనన్న కాలనీల ను మండల కన్వీనర్ జి.ఎర్రిస్వామి ఆద్వర్యంలో.. సందర్శించడం జరిగింది.. ఇల్లు కేటాయించిన జనం… వారి యొక్క గోడును జనసేన పార్టీకి విన్నవించారు. మొదట్లో మన ముఖ్యమంత్రి నవరత్నాల్లో బాగంగా ఇల్లు లేని ప్రతి కుటుంబంకు ఇల్లు తామే కట్టించి.. అక్క చెల్లెమ్మలకు తాలాలూ చేతికిస్తానని చెప్పి అధికారం రాగానే మాట మార్చి కొండలలో..గుట్టలలో స్ధలాలు కేటాయింపు చేసి ముందు ప్రభుత్వం లాగానే 4దఫాలుగా బిల్లును చెల్లింపు ఉంటుంది.. మీరే కట్టు కోవాలని లేకుంటే స్థలం వెనక్కి తీసుకుంటామని బెదిరింపు చేశారని.. అప్పుచేసి ఇల్లు కట్టు కున్న కొందరికి బిల్లు లు సరీగా చెల్లింపు చేయక వారు నిర్మాణాలు మద్య లోనే ఆపుకున్నారు..ప్రభుత్వ భూములను ప్రయివేట్ వ్యక్తి భూములు గా నకిలీ పత్రాలను సృష్టించి వాటిని కొనుగోలు చేసి బారీగా వైసీపీ నాయకులు ప్రజాధనం దోచుకున్నారని తెలిపారు.. జగనన్న ఇల్లు గునాది కూడ నోచుకోని స్థలాలకు బోరు వేసి ట్రాక్టర్ పెట్టె, కరెంట్ సప్లయ్ కూడ లేకుండా వైసిపి నాయకులు బిల్లు పెట్టుకొని ప్రజాధనం దోపిడీకి పాల్పడ్డారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి జనసేన పార్టీ ని పవన్ కళ్యాణ్ గారు స్థాపించడం జరిగింది. అని పీడిత వర్గాల గొంతుకగా జనసేన పార్టీ పనిచేస్తుంది అని ఈ వైసీపీ పాలకులు చేసే అవినీతి ని అక్రమాలను బట్ట బయలు చేసి ప్రజలకు.. ఈ దేశానికి తెలిసేలా సోషల్ మీడియా ఉద్యమం జనసేన పార్టీ చేస్తోందని తెలుపటం జరిగింది..ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి ప్రతినిధి సాకే మురళీకృష్ణ, జిల్లా కార్యదర్శి చొప్పా చంద్ర శేఖర్, సంయుక్త కార్యదర్శి శ్రీమతి జయమ్మ, మండల కన్వీనర్ ఎర్రిస్వామి, మన్నల పెద్దిరాజు, ఉపాద్యక్షులు సిరిసాల సుమన్, ప్రధాన కార్యదర్శి తాహీర్, మండల నాయకులు వంశీ, అవ్వారి రమేష్, మను, అశోక్ తదితరులు పాల్గొన్నారు.