లోకం మాధవి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు జనసేన పార్టీలో చేరిక

నెల్లిమర్ల, భోగాపురం మండలంలోని రామచంద్ర పేటలో గ్రామంలో లోకం మాధవి ఇంటింటికి జనసేన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రామచంద్ర పేట గ్రామానికి చెందిన మహిళలు లోకం మాధవిని ఘనంగా స్వాగతించారు. గ్రామంలోని ప్రతి గడపగడపకి తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వానికి ఒక్క అవకాశం ఇవ్వాలని అలాగే వైసిపి ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. రామచంద్ర పేట గ్రామంలో పర్యటిస్తున్న లోకం మాధవి దగ్గరికి అనేక సమస్యలు వచ్చాయి వాటిలో గ్రామంలో అధికంగా ఉన్న నీటి సమస్య, శుభ్రంగా లేని పారిశుద్ధ్యం, ఊరిలో దయనీయ స్థితిలో ఉన్న కాలువలు, అలాగే పక్కనే ఉన్న క్వారీ నుండి వస్తున్న దుమ్ము ధూళి వలన ప్రజలు అవస్థలకి గురవుతున్న గ్రామస్థుల గురించి మాధవి దృష్టికి వచ్చాయి. అలాగే రామచంద్ర పేట గ్రామానికి చెందిన ఎంతోమంది మహిళలు లోకం మాధవి ఆధ్వర్యంలో సుమారు 40 కుటంబాలకి చెందిన 150 మంది జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన మహిళలు మాట్లాడుతూ తాము ఎన్నో ఏళ్ల నుండి మాధవి సహాయ సహకారాలు, మంచి మనసు చూసి, పేదవాడు ఎప్పటికైనా పెద్దవాడు కావాలనే మనస్తత్వం ఉన్న ఆవిడని చూసి జనసేన పార్టీలోకి జాయిన్ అయినట్టు తెలియజేశారు. లోకం మాధవి పార్టీలో చేరిన మహిళలను ఉదేశించి మాట్లాడుతూ తాము అందరం ఒక కుటుంబం అని, రామచంద్ర పేట గ్రామం తనకు సొంత గ్రామం అని ఎన్నో ఏళ్ల నుండి ఈ గ్రామ ప్రజల సహకారం తమకి వస్తూ ఉందని, దానికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. అలాగే వచ్చే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి జనసేనని అధికారంలోకి తీసుకుని రావాలనికోరారు. ఈ కార్యక్రమంలో భోగాపురం మండల్ అధ్యక్షులు వందనాల రమణ, రాంచంద్రం పేట నాయకుడు దుక్క రాము, నీలాతి బాలకృష్ణ మరియు ముడశాల గోవిందు మండల సీనియర్ నాయకులు పల్ల రాంబాబు పిడుగు జోగారావు, పల్లంట్ల జగదీష్ బడి పైడిరాజు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.