రాపాక ఆధ్వర్యంలో జనసేనలోకి భారీ చేరికలు
రాజోలు నియోజకవర్గం: జనసేన నాయకులు డాక్టర్ రాపాక రమేష్ బాబు ఆధ్వర్యంలో శనివారం వైసీపీ నుండి జనసేనలోకి భారీ చేరికలు జరిగాయి. కరువాక, చింతలమోరి, సఖినేటిపల్లి, మేడిచర్ల పాలెం గ్రామాల నుండి అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం, ఎస్సీ, బీసీ సామాజిక వర్గాల నుండి 100 మందికి పైగా జనసేన పార్టీ సిద్ధాంతాలు ఆశయాలు నచ్చి డాక్టర్ రాపాక రమేష్ బాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ చైర్మన్, నర్సాపురం నియోజకవర్గం జనసేన నాయకులు బొమ్మిడి నాయకర్ విచ్చేసి జనసేన కండువాతో పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు శిరిగినీడి వెంకటేశ్వరరావు, రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసేన టిడిపి పార్టీల సమావేశాల సమన్వయకర్త గుండుబోగుల పెదకాపు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిలు, జిల్లా కార్యదర్శిలు, మండల అధ్యక్షులు, ఎంపీపీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, సర్పంచులు ఎంపీటీసీలు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-18-at-4.53.36-PM-1-1024x470.jpeg)