విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో “జనంలోకి జనసేన జనం కోసం జనసేన”
తణుకు నియోజకవర్గం తణుకు పట్టణంలోని 10వ వార్డు తణుకు మున్సిపల్ ఆఫీస్ పక్కనా కాపుల వీధి నుండి తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో జనంలోకి జనసేన జనం కోసం జనసేన అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ఆశయాలను రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన సేవలను తెలియజేశారు. విడివాడ రామచంద్రరావు మాట్లాడుతూ ఏ వార్డులో చూసిన డ్రైనేజీ వ్యవస్థ సరిలేరని మంచి నీటి కుళాయిలు చాలాచోట్ల మంచినీటి కుళాయి పైప్ లైన్ డ్యామేజ్ అయ్యి త్రాగునీరు వృధా అవుతుందని అన్నారు. మరీముఖ్యంగా ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు గాని ఇల్లు కట్టుకోవడానికి సరైన సౌకర్యం లేదని రోడ్లు సరిలేవని, డ్రైనేజీ వ్యవస్థ లేదని మరియు ఎలక్ట్రిసిటీ సౌకర్యం కూడా లేదని ఇల్లు కట్టుకోవడానికి మౌళిక సదుపాయాలు తక్షణమే ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూము. ఈ కార్యక్రమంలో తణుకు టౌన్ జనసేన పార్టీ అధ్యక్షులు కొమిరెడ్డి శ్రీనివాస్ తణుకు టౌన్ యూత్ అధ్యక్షులు గర్రె తులసీరామ్ ఇరగవరం మండలం పార్టీ అధ్యక్షులు ఆకేటి కాశి, తణుకు టౌన్ ప్రధాన కార్యదర్శి పంతం నానాజీ, 10వ వార్డు జనసేన పార్టీ నాయకులు కోన బాబి, సాధనాల లక్ష్మీనారాయణ, తులా నరేంద్ర శ్రీనివాస్, బక్క నాగరాజు, దాశిరెడ్డి మధు జగదీష్, పుల్లెపు సాయి కృష్ణ, జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రెటరీ తామరపు నరసింహారావు, తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి కొయ్యల విజయ్ కుమార్ జనశెట్టి భరత్ జవ్వాది ప్రసాదు, వెంపటాపు రమేష్, రిల్లు రాయుడు మొఖమట్ల సతీష్, శివటం శీను, వీర మహిళలు ఎండ్రా రత్నజ్యోతి కామవరపు రూప సునీత మంచం పవన్ కుమార్ మరియు 10వ వార్డు జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-07-at-20.01.24-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-07-at-20.01.25-1024x576.jpeg)