రైతు ఆందోళనలపై ప్రధానిమోదీ నివాసంలో కేంద్ర మంత్రుల భేటీ

వివాదాస్పద కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రైతుల డిమాండ్లపై ఇప్పటికే ప్రభుత్వం రెండు విడతలు చర్చలు విఫలమైన నేపథ్యంలో ప్రధాని మోదీ నివాసంలో ఇవాళ కేంద్ర మంత్రులు భేటీ అయ్యారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, హోంశాఖ మంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌లు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అయితే కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాల్లో సవరణలు చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. రైతు ఆందోళనలకు మద్దతు పెరగడంతో.. ఢిల్లీ సరిహద్దుల్లోని దారులన్నీ మూసివేశారు. కనీస మద్దతు ధరపై కేంద్రం హామీ ఇచ్చినా.. తాము మాత్రమే చట్టాలను రద్దు చేసే వరకు విశ్రమించేదిలేదని రైతులు నినదిస్తున్నారు.