ములకలపల్లిలో జనసేన జెండా ఆవిష్కరణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండల కేంద్రంలో జనసేన పార్టీ దిమ్మ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జనసేన పార్టీ దిమ్మను పార్టీ జెండాను ముఖ్య అతిథిగా విచ్చేసిన కొణిదల నాగబాబు ఎగరవేయవలసి ఉండగా కొన్ని అనివార్య కార్యాల వలన రాలేకపోయారు. కొణిదల నాగబాబు మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ రామ్ తాల్లూరి ఆదేశాల ప్రకారం అశ్వరావుపేట నియోజకవర్గ ముఖ్య నాయకులైనటువంటి యార్లగడ్డ శ్రీను ను జగన్నాధపురం నుంచి ములకలపల్లి మండల కేంద్రం వద్దకు ర్యాలీగా తీసుకురావడం జరిగింది. యార్లగడ్డ శీను ములకలపల్లి వచ్చి జెండా ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి మరియు యువజన మరియు మండల నాయకులు మాట్లాడుతూ.. ఈ జెండా ఆవిష్కరణ కొరకు గత మూడు రోజులుగా మండలంలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు అందరూ కూడా నిస్వార్ధంగా పనిచేశారని.. పార్టీ కోసం కార్యకర్తలు అహర్నిశలు కష్టపడుతున్నారని.. ఇదేవిధంగా మండలంలో జనసేన కార్యకర్తలు పనిచేస్తూ జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని.. ఈ జండా ఆవిష్కరణ కార్యక్రమంలో తెలియజేశారు. అదే విధంగా నాగబాబు గారు మరియు రామ్ తాలురి గారి ఆదేశాల మేరకు మన మండలానికి విచ్చేసి జెండా ఆవిష్కరించిన యార్లగడ్డ శ్రీను గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగం కార్యనిర్వాహక సభ్యులు గొల్ల వీరభద్రం, కోడిమ వంశి, ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం సెక్రటరీ గరిక రాంబాబు, ములకలపల్లి మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్, ఉపాధ్యక్షుడు పొడిచేటి చెన్నారావు, ప్రధాన కార్యదర్శి ఊకె నాగరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ చామర్తి సుధాకర్, సహాయ కార్యదర్శి బొక్క వెంకటేశ్వర్లు, కార్యదర్శి నరసింహారావు, కార్యదర్శి బాదావత్ రవికుమార్, మధిర నియోజకవర్గం విద్యార్థి విభాగ కార్యనిర్వహక సభ్యుడు గంధం ఆనంద్, ముఖ్య నాయకులు కందుకూరి వినీత్, చిర్రా భద్రయ్య, రమేష్, పవన్ మరియు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.