ఘనంగా జనసేన జెండా ఆవిష్కరణ

అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, అడ్డతీగల మండల హెడ్ క్వార్టర్ లో జనసేన పార్టీ సీనియర్ నాయకుడు తాడికొండ రాజేంద్ర ఆధ్వర్యంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు కాకి స్వామి ముఖ్యఅతిథిగా సోమవారం జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కార్యాచరణలో మండల టిడిపి నాయకులు బీజేపీ నాయకులు పాల్గొని బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవిపట్నం మండల అధ్యక్షుడు చారపు వెంకటరాయుడు, ఉపాద్యక్షుడు తుస్రం సీతారమంజనేయులు, సీనియర్ నాయకులు కొమరం దొరబాబు, తాళ్లూరి పవన్ కుమార్ రెడ్డి, రంపచోడవరం మండల ఉపాద్యక్షుడు రాగల సురేష్, చుప్పల కన్నాబాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి నర్సీ ఎర్రయ్య, గెద్దాడ రవి గంగవరం రాజు తదితరులు పాల్గొన్నారు.