టిడిపి చేపట్టిన రాష్ట్ర బంద్ కు ఉరవకొండ జనసేన మద్దతు

ఉరవకొండ నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతిపక్ష నాయకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా సోమవారం తలపెట్టిన రాష్ట్ర బంద్ లో ఉరవకొండ నియోజకవర్గంలో స్థానిక కవిత హోటల్ సర్కిల్ నందు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు అడ్డగించారు. పోలీసులకు, జనసేన, టీడీపి నాయకుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం అక్రమంగా జనసేన నాయకులను టీడీపి నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయినవారు జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్, మందల అద్యక్షులు చంద్రశేఖర్, విదపనకల్ అద్యక్షులు గోపాల్, దేవేంద్ర, రాజేశ్, రమేష్, తిలక్, మని కుమార్, బోగేశ్, బూపేశ్, భార్గవ, లోకేష్, సాయి, రాజు, అరెస్ట్ అవ్వడం జరిగింది.