అంగరంగ వైభవంగా ఊరూరా సంక్రాంతి జనసేన రంగోళి

  • మహిళామణులకు నూతన ఉత్సాహంతో పాటు జనసేన పార్టీ ఆశయాలను సిద్ధాంతాలను తెలియపరిచే బృహత్కర కార్యక్రమం

విజయనగరం నియోజకవర్గం: సంక్రాంతి పండుగ పురస్కరించుకొని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో.. విజయనగరం నియోజకవర్గంలో గల అన్ని గ్రామాలలో ఏర్పాటు చేస్తున్న ఈ ముగ్గుల పోటీలు కార్యక్రమంలో భాగంగా..
ఊరూరా సంక్రాంతి – జనసేన రంగోళి మంగళవారం ఉదయం స్థానిక ద్వారపూడి గ్రామంలో జనసేన మండల నాయకులు బొబ్బాది చంద్ర నాయుడు సమక్షంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో మహిళామణులు పాల్గొని రకరకాల రంగవల్లులు అలంకరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు మొదట, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయడమే కాకుండా పోటీలో పాల్గొన ప్రతి ఒక్కరికి కన్సలేషన్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక మహిళలు గ్రామస్తులు నుండి అనూహ్య స్పందన లభించింది. మహిళామణులకు నూతన ఉత్సాహం అందించడమే కాకుండా గ్రామస్థాయిలో మన జనసేన పార్టీ సిద్ధాంతాలను ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు రౌతు సతీష్వీ, అలేఖ్య, కరిష్మా మరియు జనసేన పార్టీ కార్పొరేటర్ ద్వారపూడి గ్రామ యువ నాయకులు రమేష్, లోకేష్, మరియు తెలుగుదేశం పార్టీ గ్రామ సర్పంచ్ ఆదిలక్ష్మి, ఎంపీటీసీ మృణాళిని గారు, మాజీ సర్పంచ్ ఎన్ని శ్రీను, జనసైనికులు గ్రామ ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.