జనసేన పార్టీకి మద్దతుగా వాడరేవు లోవరాజు ఎన్నికల ప్రచారం

ఫిషింగ్ హార్బర్ పేటలో సోమవారం సిటీ కార్యదర్శి వాడరేవు లోవరాజు జనసేన పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిటీ కార్యదర్శి లోవరాజు మాట్లాడుతూ.. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి నానాజీ గారిని కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ గారిని గెలిపించాలని ప్రజలను కోరారు. టిడిపి జనసేన బిజెపి కూటమి అధికారంలోకి వచ్చాక సముద్ర వేట విరామ సమయంలో మత్స్య కారులకి 20000 రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వడం జరుగుతుందని మత్స్యకార సోదరులకి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలెపుకృష్ణ,
మాజీ ఎంపీటీసీ శ్రీను, పాలెపు ఈశ్వర్, వాడరేవు మల్లేశ్వరరావు, మెడ నూకరాజు, బాలసుబ్రమణ్యం, రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.