కల్తీ సారా తాగి అస్వస్థతకు గురైన భాదితుడిని పరామర్శించిన వడ్లపట్ల సాయి శరత్

జనసేన జిల్లా కార్యదర్శి వడ్లపట్ల సాయి శరత్.. కల్తీ సారా తాగి అస్వస్థతకు గురైన భాదితుడిని ఏలూరు ప్రభుత్వాసుపత్రి లో పరామర్శించారు. వైసిపి విధ్వంసకర అనాలోచిత పాలనకు జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకున్న కల్తీ సారా మరణాలే నిదర్శనమన్నారు. కల్తీ సారా కాచేవారిపై చర్యలు తీసుకోవడం మానేసి ప్రజలను మభ్య పెట్టడం లేదా ప్రతిపక్షాలపై విరుచుకుపడడం ఈ ప్రభుత్వ అసమర్ధతకు తార్కాణం అని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *