‘కింగ్’ నాగార్జున నిర్మాణంలో వైష్ణవ్ తేజ్?

తొలి సినిమా `ఉప్పెన`తోనే తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో వైష్ణవ్‌కు వరుస అవకాశాలు వస్తున్నాయట. `ఉప్పెన` విడుదల కాకముందే తన రెండో సినిమా షూటింగ్‌ను వైష్ణవ్ పూర్తి చేశాడు. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి `కొండపొలం` అనే టైటిల్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటించిన ఆ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

వైష్ణవ్ మూడో చిత్రాన్ని `కింగ్` నాగార్జున నిర్మించబోతున్నారట. `మనం ఎంటర్‌టైన్‌మెంట్స్‌` బ్యానర్‌పై ఆ చిత్రాన్ని నాగార్జున నిర్మిస్తారట. ఓ కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు సమాచారం. అలాగే నిర్మాత భోగవల్లి ప్రసాద్ కూడా వైష్ణవ్ హీరోగా ఓ సినిమాను నిర్మించనున్నారట. ఈ చిత్రాన్ని కూడా ఓ నూతన దర్శకుడే తెరకెక్కించనున్నాడట.