ఆంద్రప్రదేశ్ టార్గెట్ బాల్ టీమ్ ని అభినందించిన వంపురు గంగులయ్య

పాడేరు, ఇటీవల ఉత్తరప్రదేశ్ లో జరిగిన జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలలో పాల్గొన్న ఆంద్రప్రదేశ్ టార్గెట్ బాల్ టీమ్ ని అభినందించిన జనసేనపార్టీ పాడేరు, అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా.వంపురు గంగులయ్య చిరంజీవి విధ్యకళ్యాణ్ ప్రతిభను కొనియాడారు. ఆంధ్రాయూనివర్సిటీ నుంచి టార్గెట్ బాల్ పోటీలలో కోచ్ డా.సురేష్ ఆధ్వర్యంలో ఈ పోటీలలో పాల్గొనడం జరిగింది. స్థానికంగా బలంగా ఉన్న ఉత్తరప్రదేశ్ జట్టుని 16/4 స్కోర్ తేడాతో ఘనవిజయం సాధించి తిరుగులేని విజేతగా ఆంధ్రప్రదేశ్ జట్టు నిలిచి గోల్డ్ మెడల్ కప్ సాధించి తెలుగు జాతికి తమసత్తా ఏమిటో చూపించింది. మరి ముఖ్యంగా ఈ జట్టులో పాడేరు ప్రాంతానికి చెందిన ఆదివాసీ ప్రాంతంలో నుంచి ఎంపికైన గిరిజన విద్యార్థి, క్రీడాకారుడు విధ్యకళ్యాణ్ తనదైన అద్భుతమైన ప్రదర్శనతో జట్టు గెలుపుకోసం చేసిన కృషి మరువలేనిది. జనసైనికుడు విధ్యకళ్యాణ్ గోల్డ్ మెడల్, కప్ సాధించడంతో గిరిజన ప్రజలు, జనసైనికులు సంతోషం వ్యక్తం చేసారు.