జి.మాడుగుల రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న వంపూరు గంగులయ్య
అరకు నియోజకవర్గం, జి.మాడుగుల మండలం బోయితేలి పంచాయతీ మద్దిగరువు చుట్టుపక్కల ఉన్న గ్రామాలను జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇంచార్జ్ శ్రీ వంపూరు గంగులయ్య పర్యటించారు. అక్కడ ఉన్న రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ 16 తేదీన మద్దిగరువు గ్రామంలో రైతుల సమస్యలపై సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జి.మాడుగుల మండల జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు శ్రీ టీ.వెంకట రమణ, ఉపాధ్యక్షులు శ్రీ గంగ ప్రసాద్, పాస్టర్ శ్రీ మోహన్ రావు, కుసంగి రామయ్యా, వెంకన్న దొర, ఈశ్వర్ రావు, ప్రదీప్, ప్రవీణ్, అప్పన, పూజారి కొండ బాబు, ఆనంద్ కుమార్, వరాలు, సన్నిబాబు, పాడేరు మండల ప్రెసిడెంట్ మురళి కృష్ణ, ఉప అధ్యక్షులు సాలేబు అశోక్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-30-at-4.56.14-PM-1024x576.jpeg)