జాతీయ రైతు దినోత్సవం| రైతులను ఘనంగా సత్కరించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్: జాతీయ రైతు దినోత్సవం సందర్బంగా జనసేన పార్టీ పిలుపు మేరకు శుక్రవారం రైతుల కష్ట, సుఖాలు తెలుసుకునేందుకు కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు కరెడ్ల గోవింద్ ఆధ్వర్యంలో.. జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ కాకినాడ రూరల్ మండలం, కొవ్వూరు గ్రామంలో పర్యటించి స్థానిక రైతులను కలుసుకుని వారికి శుభాకాంక్షలు తెలిపి, వారిని శాలువాతో సత్కరించి, మిఠాయులు తినిపించి, వారితో మాట్లాడి వారి యొక్క సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్బంగా గ్రామంలోని రైతులు, స్థానికులు, మహిళలు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల మురుగునిరు, వ్యర్దాలు అన్ని పంటకాలువలో కలిసి పోతున్నందువల్ల స్థానికులు అనేక అనారోగ్యాలకి గురి అవుతున్నామని తెలిపారు. వారితో కలిసి ఆ కాలవను పరిశీలించిన జనసేన పంతం నానాజీ ఈ సమస్యను అదికారుల ద్రుష్తికి తీస్కెళ్ళి, సమస్య పరిష్కారానికి జనసేన క్రుషి చేస్తుంద్ని హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో స్థానికులు, జనసేన నాయకులు పాల్గొన్నారు.