వనపర్తి పట్టణ కమిటీ సమావేశం

తెలంగాణ, వనపర్తి, వనపర్తి జిల్లా కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయంలో వనపర్తి పట్టణ కమిటీ సభ్యులతో గురువారం ముఖ్య సమావేశం నిర్వహించినట్లు వనపర్తి నియోజకవర్గ జనసేన పార్టీ కో-ఆర్డినేటర్ ముకుంద నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీని వనపర్తి పట్టణములో అన్ని వార్డులలో బలంగా విస్తరించే విధంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని జనసేన పార్టీని ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భవిష్యత్తులో జరగబోయే స్థానిక ఎన్నికలలో బలమైన శక్తిగా ప్రజా సమస్యలే పరిష్కార ఎజెండాగా ముందుకు వెళ్లాలని, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాన్ని, అలాగే ఈ సమాజంలో వెనుకబాటుకు గురవుతున్న సామాజిక వర్గాలను రాజకీయంగా అవకాశం కల్పిస్తూ జనసేన పార్టీ నడిపించే విధంగానే జనసేన పార్టీని వనపర్తి పట్టణ పరిధిలో బలమైన శక్తిగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి జనసైనికుడు తీసుకోవాలని కోరడం జరిగిందనీ, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించే దిశగానే ముందుకు సాగాలని వనపర్తి నియోజక వర్గంలో ప్రధానంగా పట్టణ పరిధిలో జనసేన పార్టీకి బలమైన మద్దతుదారులు ఉన్నారు వారందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చి వనపర్తి నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా భవిష్యత్తు రాజకీయాలను భవిష్యత్తు తరాలకు నీతివంతంగా మార్పు నిచ్చే పార్టీగా ప్రజల పార్టీగా అనుకునే విధంగా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త జన సైనికులు పార్టీ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని అప్పుడే వెనకబాటుకు గురైన సమాజానికి గొప్ప రాజకీయ పార్టీని అందించిన వాళ్లమవుతామని పార్టీ సభ్యులకు జనసేన పార్టీ వనపర్తి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ముకుంద నాయుడు గారు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో వనపర్తి పట్టణ అధ్యక్షుడు సురేష్ యాదవ్ నాయకులు ఉత్తేజ్ కుమార్, ప్రకాష్ , వెంకటేశ్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.