పత్సమట్ల ధర్మరాజుని మర్యాదపూర్వకంగా కలిసిన యల్లటూరు శ్రీనివాసరాజు

ఉంగుటూరు నియోజకవర్గం: జనసేన పార్టీ అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజుని వారి కార్యాలయములో వారి కార్యాలయములో జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు సమన్వయకర్త యల్లటూరు శ్రీనివాసరాజు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉంగుటూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి బలమైన నాయకులు పత్సమట్ల ధర్మరాజు గారిని గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలను ఉద్దేశించి తెలిపారు. వారితో పాటు రవిరాజు, వినోద్ కుమార్ వర్మ, చమర్తి మహేష్ రాజు, అంజి రాజు తదితరులు పాల్గొన్నారు.