క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి ముఖ్య నాయకులతో వంగ లక్ష్మణ్ గౌడ్ భేటీ…!

మహబూబ్ నగర్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసైనికుల భద్రత, వారికి భరోసా కొరకు చేపట్టినటువంటి ఒక గొప్ప కార్యక్రమం క్రియాశీలక సబ్యత్వ కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గత సంవత్సరం ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఈ సంవత్సరం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ యొక్క మలిదశ సభ్యత్వ కార్యక్రమం మరింత బలంగా తీసుకెళ్ళాలి అనే అంశంపై
వంగ లక్ష్మణ్ గౌడ్ ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకులతో కలిసి దిశా నిర్ధేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా ముఖ్య నాయకులు రేచర్ల. శేఖర్, జానీ, గోపాస్ కురుమన్న, సూర్య, జెర్రిపాటి చంద్ర శేఖర్, గోపాస్ రమేష్, ఎస్.పి సూర్య, శ్రీనివాస్ నాయక్ మరియు ఉమ్మడి జిల్లా నాయకులు పగడాల. రాఘవేంద్ర (పి.ఆర్), సురేందర్ గౌడ్, శరత్ గౌడ్, శ్యామ్, గౌరవ్, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.