శనివారం సిరగం పంచాయతీలో పర్యటన

అరకు నియోజవర్గం: అరకు నియోజకవర్గ కేంద్రం పరిధిలో గల సిరిగం పంచాయతీ హెడ్ క్వార్టర్ లో జనసేన పార్టీ మాజీ ఎంపిటి సాయిబాబా దురియా. అల్లంగి.రామకృష్ణ తదితరుల ఆధ్వర్యంలో సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆయా గ్రామాలలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన మాటలు జనసేన సిద్ధాంతాలు గడప గడపకు తీసుకెళ్ళే భాగంగానూ మరియు క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసే ప్రయత్నంగా ఆ యొక్క గ్రామాలలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు సకాలంలో హాజరు కాగలరని తెలిపారు.