మానవత్వాన్ని చాటుకున్న వంగ లక్ష్మణ్ గౌడ్

శ్రీకాకుళం, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్ మరొకసారి మానవత్వాన్ని చాటుకున్నారు. అర్ధరాత్రి డెలివరీ కోసం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జింస్ ఆసుపత్రిలో ‘ఏ’ నెగెటివ్ బ్లడ్ లేక దిక్కులేని స్థితిలో ఉండగా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్ ని మధ్యరాత్రి 2గంటల సమయంలో ఫోన్ లో సంప్రదించగా తెల్లవారుఝాము 4గంటల వరకు ప్రయత్నించి ఏపిలోని జనసేన పార్టీ వారితో మాట్లాడి వంగ లక్ష్మణ్ గౌడ్ బ్లడ్ సమకూర్చారు. ఈ సందర్భంగా వంగ లక్ష్మణ్ గౌడ్ కి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలిపారు. అధికారంలో ఉండి కూడా నిరుపేదలకు సహయపడని ఎందరో నాయకులను చూశాను కానీ మీకు ఏ అధికారం లేకపోయినా సేవచేయలనే సంకల్పంతో అర్ధరాతి నుండి తెల్లవారుఝాము వరకు కష్టపడి అతి తక్కువగా దొరికే ‘ఏ’ నెగెటివ్ బ్లడ్ ను ఏర్పాటు చేయించిన మీరు భవిష్యత్తులో గొప్పనాయకులు కావాలని కోరుకుంటూ ఇంతమంచి జనసేన సైన్యాన్ని ఏర్పరచిన మీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ కి మనస్ఫూర్తి గా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని బైండ్ల సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవీందర్ అన్నారు.