వంగ లక్ష్మణ్ గౌడ్ 38వ రోజు పాదయాత్ర

నాగర్ కర్నూల్ నియోజకవర్గం, తాడుర్ మండలం, గుట్టలపల్లి, పొల్ ముర్ గ్రామంలో వంగ లక్ష్మణ్ గౌడ్ నియోజకవర్గ నాయకులతో కలిసి నాగర్ కర్నూల్ నియోజకవర్గం గ్రామంలో పాదయాత్ర చేపట్టడం జరిగింది. గ్రామంలోని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, పార్టీ యొక్క సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తూ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేయబోతుంది, కచ్చితంగా మన ఓటు మనం వేసుకొని, మన బహుజన రాజ్యాధికారం సాధించుకుందాం. ఒక వర్గ పాలనలో నలిగిపోతున్న నాగర్ కర్నూల్ నియోజకవర్గాన్ని కాపాడుకోవాలంటే మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావాలి అని అన్నారు. ఇది మన రాష్ట్రం, 1200 మంది విద్యార్థుల బలిదానలతో సాధించుకున్న మన రాష్ట్రంలో ఈ మోస పూరిత పాలనలో ప్రజలని మభ్య పెడుతూ వారి పబ్బం గడుపుకుంటున్నారు. ఈ మోసపూరిత పాలన అంతం కావాలంటే ఒకసారి జనసేన పార్టీకి మద్దతు ఇవ్వండని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు పెరుమళ్ళ శేఖర్, సూర్య, ఎడ్ల రాకేష్, పూస శివ, జీవన్, మంగ శ్రీకాంత్, నరసింహ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.