జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన వంగ లక్ష్మణ్ గౌడ్

నాగర్ కర్నూల్: భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నాగర్ కర్నూల్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు, నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంగ లక్ష్మణ్ గౌడ్ ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేసి జైహింద్ అంటూ నినాదించారు.