మానవత్వం చాటుకున్న వంగలపూడి వంశీ

తుని, డాక్టర్ సందీప్ పంచకర్ల స్ఫూర్తితో 2018 పవన్ కళ్యాణ్ పోరాటయాత్రలో తుని నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఫ్లెక్సీ కడుతూ మరణించిన జనసైనికుడు నాగరాజు కుమారుని దత్తత తీసుకుని డిగ్రీ విద్య పూర్తి అయ్యేవరకు ఖర్చు భరిస్తున్న వంగలపూడి వంశీ. బుధవారం నాలుగవ సంవత్సరం విద్య ఖర్చు నిమిత్తం 14000/- రూపాయల నగదు జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి వంగలపూడి నాగేంద్ర చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.