గుంటూరు జనసేన ఆధ్వర్యంలో ఘనంగా వంగవీటి రంగా వర్ధంతి వేడుకలు

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కీర్తిశేషులు వంగవీటి మోహన రంగా 34వ వర్ధంతి సందర్భంగా జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మొదటగా జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర జర్నరల్ సెక్రటరీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తో కలసి రంగా చిత్ర పటానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సత్తెనపల్లి నియోజకవర్గం, పత్తిపాడు నియోజకవర్గంలో మరియు సిటీ వార్డులో కొత్తపేట, నల్లచెరువు, పాత గుంటూరు, గోరంట్ల, నగరం పాలెంలో ఉన్న స్థానిక రంగా విగ్రహాలకు పూలదండలు వేసి అన్నసంతర్పణ కార్యక్రమాలలో పాల్గొనటం జరిగింది.