అంబులెన్స్ కి దారిచ్చిన వారాహి
![](https://janasenanewssletter1.blob.core.windows.net/images/ff22a199-377b-476d-97c6-ba9f2260f892.jpeg)
• మానవత్వం చాటుకున్న శ్రీ పవన్ కళ్యాణ్
ఇసుకేస్తే రాలనంత మంది జనసేన శ్రేణులు, ప్రజలు వెంట తరలిరాగా వారాహి యాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. మార్గమధ్యంలో పెనమలూరు నియోజకవర్గం, ఈడ్పుగల్లు వద్ద అత్యవసర సర్వీసు అయిన అంబులెన్స్ వాహనాల మధ్య ఇరుక్కుపోవడంతో… వారాహిని పది నిమిషాలు నిలిపివేసి ఆంబులెన్స్ కి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దారిచ్చారు. అంబులెన్స్ ముందుకు వెళ్లిపోయిన తర్వాత వారాహి యాత్ర కొనసాగింది. మానవతావాదిగా శ్రీ పవన్ కళ్యాణ్ మరోసారి రుజువు చేసుకున్నారు.