పవన్ వారాహి యాత్ర పేరిట పితాని ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

ముమ్మిడివరం: జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టబోయే వారాహి యాత్ర విజయవంతం కావాలని ముమ్మిడివరం గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జున రావు, ముమ్మిడివరం మండల అధ్యక్షులు గొలకోటి వెంకటేశ్వరరావు, గొలకోటి సాయిబాబు, నాతి నాగేశ్వరరావు, కర్రా దుర్గాప్రసాద్, కామన దుర్గాప్రసాద్, పోలిశెట్టి కుమార్, గంధం శ్రీను, జగతా కేశవ్, పెన్నాడ తేజ, జగతా శివ, వక్కపట్ల రాము, విత్తనాల రవితేజ, మరియు ముమ్మిడివరం టౌన్ వైడ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పాల్గొన్నారు.