వారాహి యాత్ర వాలంటీర్ కోర్ కమిటీ సమావేశం

ముమ్మిడివరం: జూన్ 21వ తేదీన ముమ్మిడివరంలో జరగబోయే వారాహి విజయ యాత్ర బహిరంగ సభ కోసం సుమారు 250 మంది జనసైనికులతో వాలంటీర్స్ కోర్ కమిటి సన్నాహక సమావేశం జరిగింది. దీనికి సహకరించిన నియోజకవర్గ ఇన్చార్జి పితాని బాలకృష్ణ గారికి అలాగే విలువైన సూచనలు అందించిన బొలిశెట్టి సత్యనారాయణ గారికి మరియు వాలంటీర్స్ గా పని చేయడానికి ముందుకు వచ్చిన ప్రతీ జనసైనికుడికి వారాహి రాష్ట్ర విజయ యాత్ర కోర్ కమిటీ తరుపున జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసారు.