మానవత్వం చాటుకున్న యాళ్ళ వరప్రసాద్

పి.గన్నవరం, ఎదుటి మనిషికి సహాయం చేయాలంటే ఏ బంధం అవసరం లేదు పిడికెడు గుండెల్లో చిటికెడు మానవత్వం ఉంటే చాలని నిరూపించుకున్న యాళ్ళ వరప్రసాద్. గంటి పెదపూడి బుర్రిలంక గ్రామానికి చెందిన కె.ధరణి కుమార్ కొంత కాలం నుంచి కిడ్నీ డామేజెస్ కారణంగా బాధ పడుతున్నారు. అది తెలిసుకుని యాళ్ళ వరప్రసాద్ టీమ్ 1లక్ష రూపాయలు ఆర్ధిక సాయం చేయడం జరిగింది. లక్ష రూపాయల చెక్ ను గురువారం వారికి అందజేయడం జరిగింది. అలాగే డాక్టర్లు నిమిత్తం ఎలాంటి సహాయం కావల్సిన నేను సహాయం చేయస్తానని భరోసా ఇవ్వడం జరిగింది. ధరణి కుమార్ కు సహాయం చేసిన యాళ్ళ వరప్రసాద్ టీమ్ కు ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో యాళ్ళ వరప్రసాద్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.