జనసేన, టిడిపి ఉమ్మడి కార్యాచరణ సమావేశంలో పాల్గొన్న వరికూటి నాగరాజు

కనిగిరి: జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ గారు కనిగిరి నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కమిటీ వరికూటి నాగరాజు గారిని నియమించిన తర్వాత మొదటి ఉమ్మడి కార్యాచరణ మీటింగ్ కు కనిగిరి టిడిపి కార్యాలయంలో టిడిపి ఇన్చార్జ్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి హాజరై ఇరు పార్టీల కార్యచరణ గురించి చర్చించి, రెండు 2024 ఎలక్షన్ లో కనిగిరి నియోజకవర్గలో జనసేన టిడిపి కూటమి అభ్యర్థి గెలుపు దిశగా అందరు పనిచేయాలని నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో జనసేన తరపున జిల్లా కార్యదర్శి రహీముల్లా, జిల్లా ప్రోగ్రామ్ కమిటీ కార్యదర్శి రామిశెట్టి సునీల్ కుమార్, జనసేన మండల అధ్యక్షులు రమేష్, దర్శి ఏడుకొండలు, జానపాటి రాజా, టి ప్రవీణ్, కే వెంకట్రావు మరియు జనసేన వార్డు మెంబర్ మాదాసు రమేష్ తదితరులు పాల్గొన్నారు.