తెలుగుదేశం రాష్ట్ర బంద్ కు వీరఘట్టం జనసేన మద్దతు

పాలకొండ నియోజకవర్గం: మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన సందర్బంగా సోమవారం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ & జనసేన పార్టీ సంయుక్తంగా టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు ఖండాపు వెంకటరమణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సందర్బంగా ప్రజలు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుఖాణాలు మూసివేసి బంద్ కి సహకరించారు. ఈ సందర్భంగా జనసేన జానీ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు టీడీపీ ప్రకటించిన బంద్ కి సంపూరణమైన మద్దతు పాలకొండ జనసేన పార్టీ తరుపున ప్రకటించుతున్నాం. వైస్సార్సీపీ ప్రభుత్వం కక్ష పూర్తిమైన పరిపాలన విధానం వలన ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. కనుక 2024లో వైస్సార్సీపీ ప్రభుత్వంను ఇంటికి పంపించే బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకోవాలని జనసేన పార్టీ తరుపున తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు వివిధ గ్రామాల తెలుగుదేశం పార్టీ & జనసేన పార్టీ ముఖ్య నాయకులు, జనసైనికులు, తదితరులు పాల్గొని విజయవంతం చేసారు.