ఝాన్సీ లక్ష్మీబాయికి నివాళులర్పించిన వీరమహిళ కళ్యాణి

రాజమండ్రి రూరల్: స్వపరిపాలన, స్వాభిమానమే లక్ష్యంగా భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాడి ప్రాణత్యాగం చేసిన ఝాన్సీరాణి లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ఆ ధీర వనితకు హృదయపూర్వక ఘన నివాళులర్పించిన వీరమహిళ కళ్యాణి. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ చంటిబిడ్డను వీపున కట్టుకుని ఆమె చేసిన పోరాటం నేటికీ స్ఫూర్తిదాయకం. మహిళలకు సాధికారత కల్పించడం, వారికి సరైన విద్యను అందించడం, నారీశక్తిని సామాజిక, దేశ ప్రయోజనానికి వినియోగించడమే ఝాన్సీరాణి లక్ష్మీబాయికి మనమిచ్చే ఘనమైన నివాళి అన్నారు.