ముదినేపల్లి జనసేన పార్టీ అధ్యక్షుడు గా వీరంకి వెంకయ్య నియామకం

ముదినేపల్లి, మండలంలో జనసేన జోరు పెరిగింది. ఇప్పటికే అధికార పార్టీపై నెలకొన్న సమ్మతితో ఆ పార్టీ నుంచి బయటకి వచ్చిన వీరంకి వెంకయ్యకు జనసేన పార్టీ ముదినేపల్లి మండల అధ్యక్షుడుగా నియమించారు. రాజకీయంగా అనుభవం ఉన్న వీరంకి వెంకయ్య జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలుపుతున్నారు. అదేవిధంగా మండలంలో పలువురి కీలక నాయకులతో వీరంకికి మంచి పరిచయాలు ఉన్నాయి. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే ముదినేపల్లి రాజకీయం రసవత్తరంగా సాగుతుందనే అభిప్రాయాలు సీనియర్ నాయకులలో గుసగుసలు మొదలైనాయి. ఏది ఏమైనా ముదినేపల్లిలో జనసేన పార్టీని సమర్ధవంతంగా నడిపించి అందరిని కలుపుకొంటూ యువతను, సీనియర్లను, మహిళలను ఆకట్టుకునే దిశగా, గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై గళం విప్పేందుకు సిద్ధమని త్వరలో కార్యాచరణ ప్రారంభిస్తానాని వీరంకి వెంకయ్య తెలిపారు.