ప్రాణం ఉన్నంత వరకు పార్టీ కార్యకర్తల కోసం పనిచేస్తాం: వాసగిరి మణికంఠ

అనంతపురం జిల్లా, రోడ్డు ప్రమాదంలో గాయపడిన గుంతకల్ మండలం తిమ్మాపురం గ్రామం జనసైనికుడు షాషావలి ని స్థానిక గుంతకల్ గవర్నమెంట్ హాస్పిటల్ నందు అనంతపూర్ జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ మరియు జనసేన పార్టీ గుంతకల్ మండల అధ్యక్షుడు కురువ పురుషోత్తం జనసేన నాయకులు, కార్యకర్తలు వెళ్లి పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలకు ఏమి జరిగినా జనసేన పార్టీ అండగా ఉంటుందని గతంలోనూ చెప్పామని, ఇప్పుడు చెబుతున్నామని ప్రాణం ఉన్నంత వరకు పార్టీ కార్యకర్తల కోసం పని చేస్తామని అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ తెలియజేశారు.